Godavarikhani Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం (ఏప్రిల్ 4, 2026) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
రాజేష్ థియేటర్ టర్నింగ్ వద్ద అతి వేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
Read Also:Telangana: మహిళల ఉన్నత విద్యలో తెలంగాణ టాప్
Godavarikhani Road Accident: అతి వేగమే ప్రమాదానికి కారణం?
ఈ ఘటనలో ఈ ప్రమాదంలో జీఎం కాలనీకి చెందిన శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున రాజేష్ థియేటర్ సమీపంలో కారు స్పీడ్ గా విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Video:
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు గాయపడిన వారిని హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

