Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' సినిమా బృందంపై అట్రాసిటీ కేసుకు డిమాండ్

'పెద్ది' సినిమా బృందంపై అట్రాసిటీ కేసుకు డిమాండ్

వార్త 6 days ago

Peddi Movie Controversy : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) చుట్టూ సరికొత్త వివాదం ముదురుతోంది.

ఈ సినిమాలో గిరిజన సమాజాన్ని తక్కువ చేసి చూపేలా, వారిని కించపరిచేలా పలు డైలాగులు ఉన్నాయంటూ గిరిజన సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన, చిత్ర నిర్మాణ సంస్థతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సెన్సార్ బోర్డు సభ్యులపై తక్షణమే SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మన్యం కలెక్టరేట్‌లో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి గిరిజన నేతలు అధికారికంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.

Read Also : పవన్ కళ్యాణ్ పై నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్!

15 సార్లు కించపరిచారు.. అధికారులకు ఫిర్యాదుల పర్వం!

సినిమాలో కేవలం ఒకట్రెండు చోట్ల కాకుండా, ఏకంగా 15 సందర్భాల్లో గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మరియు వారిని అవమానించేలా సంభాషణలు ఉన్నాయని గిరిజన నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన వారు కేవలం అధికార పక్షానికే కాకుండా.. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందజేశారు. విజయనగరం ఆర్డీఓ (RDO), జిల్లా ఎస్పీ (SP)లను వ్యక్తిగతంగా కలిసి చిత్రబృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక వినతిపత్రాలు సమర్పించారు. వివాదాస్పద డైలాగులను సినిమా నుండి పూర్తిగా తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సినిమా విడుదలను అడ్డుకుంటామని మరియు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha