Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PoKలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి

PoKలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి

వార్త 2 days ago

POK : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. స్థానిక ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనలపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన తాజా కాల్పుల్లో మరో 16 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.

గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటికే 30 మంది మరణించగా, తాజా దుర్ఘటనతో మొత్తం మృతుల సంఖ్య 46కు చేరుకుంది. భద్రతా దళాలు టియర్ గ్యాస్, లైవ్ ఫైరింగ్‌తో విరుచుకుపడుతుండటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణిపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?

ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతే కారణం.. నిప్పుల కుంపటిలా మారిన పీఓకే

పీఓకేలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, పిరమిడ్ స్థాయికి చేరిన నిత్యావసరాల ధరలు మరియు రాజకీయ అస్థిరతకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. తమ ప్రాంత వనరులను పాకిస్థాన్ దోచుకుంటోందని, తమకు కనీస సౌకర్యాలు, రాయితీలు కల్పించడంలో ఇస్లామాబాద్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్థానిక కూటములు ఆరోపిస్తున్నాయి. గోధుమ పిండి, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం.. ప్రస్తుతం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటుగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ ప్రజలు చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి పాక్ సైన్యం బుల్లెట్లను ఆశ్రయించడం అక్కడ పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha