దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేస్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వార్తలను ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవన్నీ అవాస్తవాలని, ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆయన వెల్లడించారు.
Read Also : ప్రధాని మోదీ సూచనలు జాతీయ ప్రయోజనం: విజయసాయిరెడ్డి

పాత వీడియోలతో తప్పుదోవ
ఈ తప్పుడు ప్రచారానికి ప్రధాన కారణం గతంలో (2017-18 సమయంలో) జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు మళ్ళీ తెరపైకి రావడమే. సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం ఇంధన పొదుపుపై జరిగిన చర్చల తాలూకు వీడియోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రస్తుతానికి అన్వయిస్తూ షేర్ చేస్తున్నారు. ఈ పాత వీడియోలు ‘వే టు న్యూస్’ (Way2News) వంటి వేదికల ద్వారా వైరల్ కావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. సాంకేతికతను వాడుకుని పాత వార్తలను కొత్తగా చిత్రీకరించడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.
చమురు కొరత లేదు – అపోహలు వద్దు
ప్రస్తుతం దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎటువంటి చమురు కొరత లేదని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇంధన సరఫరా సజావుగానే సాగుతోందని, ఏరోజూ బంకులను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదా డీలర్ల అసోసియేషన్కు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పోస్టులను గుడ్డిగా నమ్మకూడదని సూచించారు. ఆదివారం కూడా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయని, వాహనదారులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణాలు కొనసాగించవచ్చని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

