Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమను నిరాకరించిందని మైనర్ బాలిక హత్య

ప్రేమను నిరాకరించిందని మైనర్ బాలిక హత్య

వార్త 2 months ago

కడపలో దారుణం

Kadapa crime news : కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు మైనర్ బాలికను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేట మండలంలో జరిగింది.

ప్రేమ పేరుతో వేధింపులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజీపేట మండలం ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్ అనే యువకుడు అదే మండలానికి చెందిన కీర్తన (17) అనే బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న ఆ బాలిక తన ప్రేమను అంగీకరించలేనని స్పష్టంగా చెప్పింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి

శుక్రవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ అక్కడికి చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

బాలిక అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకొని తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలి ఉన్న ఆమెను వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Read Also: Madhya Pradesh Crime: భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

 kadapa crime news

నిందితుడు అరెస్ట్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖాజీపేట పోలీసులు వెంటనే స్పందించి పరారీలో ఉన్న నిందితుడు ఆవుల వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసుతో పాటు POCSO చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గ్రామాల్లో ఉద్రిక్తత

ఈ ఘటనతో ఖాజీపేట అగ్రహారం మరియు ఆంజనేయకోట్టాలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

చిన్నారి గొంతులో ఇరుక్కున్నఆక్వేరియం చేప.. ఏం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha