Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రొ.నాగేశ్వర్ పై తెలంగాణ జనసేన శ్రేణుల ఆగ్రహం

ప్రొ.నాగేశ్వర్ పై తెలంగాణ జనసేన శ్రేణుల ఆగ్రహం

వార్త 2 weeks ago

Prof Nageshwar : హైదరాబాద్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పలువురు జర్నలిస్టులతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ సమావేశంలో కొందరు విలేకర్లు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రెస్‌మీట్‌లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వారిని వారించకపోగా, మౌనంగా మద్దతు పలికినట్లు వ్యవహరించడం సరికాదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కావాలనే ఈ విధమైన సోషల్ మీడియా ప్రచారాలకు మరియు వ్యక్తిత్వ హననానికి (Character Assassination) పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Read Also : రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం

తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం: జనసేన శ్రేణుల సూటి ప్రశ్నలు

ఈ వివాదంపై తెలంగాణ జనసేన సోషల్ మీడియా విభాగాలు మరియు నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఉద్దేశించి ఘాటుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ఉన్న వివాదాలు సమసిపోయాయని చెబుతూనే, అంతర్గతంగా నాగేశ్వర్ మళ్లీ ‘తెలంగాణ సెంటిమెంట్’ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా కొందరు జర్నలిస్టులు ప్రవర్తిస్తుంటే దానికి వేదికగా మారడం ఒక మేధావిగా ఆయనకు తగదని చురకలు అంటిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సదరు విలేకర్లతో పాటు ప్రెస్ మీట్ నిర్వాహకులు కూడా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలను తీవ్రం చేస్తామని జనసేన శ్రేణులు హెచ్చరించడంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha