Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి

పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి

వార్త 3 weeks ago

Puri Rath Yatra stampede:ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎంతో వైభవంగా మొదలైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈ తోపులాట వల్ల ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా, మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పవిత్రమైన రథయాత్రలో జరిగిన ఈ అపశృతి స్థానికంగా కలకలం రేపింది.

Read also: Priyanka Gandhi : ప్రియాంక గాంధీ పేరుతో రూ.3 కోట్ల మోసానికి యత్నం!

 Stampede at the Puri Jagannath Rath Yatra

వెంటనే స్పందించిన సహాయక బృందాలు

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికార యంత్రాంగం మరియు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన భక్తులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారికి ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు రథయాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Puri Rath Yatra stampede:పెరిగిన భక్తుల రద్దీ కారణం

ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈసారి రథయాత్ర చూడటానికి ఊహించని స్థాయిలో జనం తరలివచ్చారు. రథాన్ని లాగే సమయంలో భక్తుల మధ్య జరిగిన తోపులాట వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. భక్తులు సురక్షితంగా స్వామివారిని దర్శించుకునేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Epaper: epaper.vaartha.com

సొంత గూడు ఖాళీ అవుతున్నా.. మేనల్లుడినే వెనకేసుకొస్తున్న దీదీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha