Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంత గూడు ఖాళీ అవుతున్నా.. మేనల్లుడినే వెనకేసుకొస్తున్న దీదీ!

సొంత గూడు ఖాళీ అవుతున్నా.. మేనల్లుడినే వెనకేసుకొస్తున్న దీదీ!

వార్త 3 weeks ago

Mamata Banerjee : పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో భారీ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి.

పార్టీకి ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తిరుగుబాటు శిబిరంలో చేరుతున్నా.. తృణమూల్ చీఫ్‌ మమతా బెనర్జీ మాత్రం తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా టీఎంసీ సీనియర్ నేత, కమర్‌హాటి ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలకుపైగా మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచే కీలక నేతగా ఉన్న మదన్ మిత్రా తీసుకున్న నిర్ణయం టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబసభ్యులకు పాఠశాల నియామకాల కేసులో ఈడీ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also : Priyanka Gandhi : ప్రియాంక గాంధీ పేరుతో రూ.3 కోట్ల మోసానికి యత్నం!

 Mamata Banerjee

Mamata Banerjee : పార్టీలో నిర్ణయాలన్నీ కొద్దిమంది చేతుల్లోనే ..

ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా మమత శిబిరాన్ని వీడి తిరుగుబాటు వర్గంలో చేరారు. పార్టీలో నిర్ణయాలన్నీ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, సీనియర్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని తిరుగుబాటు నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చుట్టూ ఏర్పడిన నాయకత్వ వ్యవస్థపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ విమర్శలను మమతాబెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు. అభిషేక్ ఎలాంటి తప్పూ చేయలేదని, భవిష్యత్తులో కూడా ఆయన పార్టీకి కీలక నాయకుడిగానే కొనసాగుతారని మమత స్పష్టంచేశారు. కొంతమంది పార్టీని వీడినా, టీఎంసీ బలహీనపడదని, నమ్మకమైన కార్యకర్తలు, ప్రజలే తమ అసలు బలమని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎదుర్కొన్న పరాజయం తర్వాత పార్టీలో అసంతృప్తి మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలపై సమీక్ష, భవిష్యత్తు వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుకు దారితీసిందని అంటున్నారు. మరోవైపు తిరుగుబాటు వర్గం.. పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులపై కూడా పోరాటం కొనసాగిస్తోంది. ఈ అంశం ఎన్నికల సంఘం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీపై తమకే అసలు హక్కు ఉందని తిరుగుబాటు నేతలు వాదిస్తుండగా, అధికారిక టీఎంసీ మాత్రం ఆ వాదనను ఖండిస్తోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య మమతాబెనర్జీ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టిపెట్టారు. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించాలని నాయకులకు సూచించినట్లు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha