Dailyhunt
రాజ్‌పురా - శంభు మధ్య రైల్వే ట్రాక్‌పై పేలుడు

రాజ్‌పురా - శంభు మధ్య రైల్వే ట్రాక్‌పై పేలుడు

వార్త 1 week ago

Punjab Railway Track Blast: పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజ్‌పురా - శంభు మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ పేలుడు సంభవించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, సంఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.

Read also: Karnataka school rules : స్కూళ్లలో డ్యాన్స్‌లపై కొత్త నిబంధనలు… కర్ణాటక కీలక నిర్ణయం

రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఛిద్రమైన వ్యక్తి మృతదేహం

రాజ్‌పురా – శంభు సెక్షన్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పేలుడు తీవ్రతకు ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా ఛిద్రమై అక్కడ పడి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మరియు రైల్వే రక్షణ దళం (RPF) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరణించిన వ్యక్తి ఎవరు? ఆ పేలుడు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Punjab Railway Track Blast: కుట్ర కోణంలో దర్యాప్తు.. ఉగ్రవాద చర్యేనా?

ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి రైల్వే ట్రాక్‌పై బాంబును అమర్చడానికి ప్రయత్నిస్తుండగా, అది అనుకోకుండా హఠాత్తుగా పేలి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రైలు రాకపోకలకు విఘాతం కలిగించడానికి లేదా భారీ ప్రాణనష్టం కలిగించే ఉద్దేశంతో ఈ కుట్ర పన్ని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఈ ఘటన వెనుక ఏదైనా ఉగ్రవాద ముఠా హస్తం ఉందా అనే కోణంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha