India Russia Trade: ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న రష్యా ఇంధన రంగాన్ని ఆదుకోవడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడి రిఫైనరీలు మూతపడి పెట్రోల్ కొరత ఏర్పడటంతో, భారత్ నుంచి రష్యాకు పెద్ద ఎత్తున గ్యాసోలిన్ (పెట్రోల్) ఎగుమతులు జరుగుతున్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ఆధారంగా 'వోర్టెక్సా' (Vortexa) వెల్లడించింది.
Read Also :Switzerland shooting: స్విట్జర్లాండ్లో కాల్పుల కలకలం

రష్యాలో ఇంధన సంక్షోభం & భారత్ ఎగుమతులు
జూలై, ఆగస్టు నెలల్లో రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ 32 సార్లు డ్రోన్ దాడులు చేయడంతో దేశీయంగా ఇంధన ఉత్పత్తి ఏకంగా 70 శాతం పడిపోయింది. గడిచిన రెండు నెలల్లో భారతీయ రిఫైనరీలు సుమారు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ను రష్యాకు పంపాయి. గుజరాత్లోని 'నయారా ఎనర్జీ' కి చెందిన వడినార్ రిఫైనరీ నుంచి ఈ సరఫరా అధికంగా జరిగింది (ఈ కంపెనీలో రష్యా రోస్నెఫ్ట్కు సగం వాటా ఉంది). ఆగస్టు నెలలో రష్యా సముద్ర మార్గ గ్యాసోలిన్ దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 1,25,000 బ్యారెళ్లకు చేరాయి. భారత్తో పాటు తుర్కియే, మొరాకో దేశాలు కూడా రష్యాకు గ్యాసోలిన్ను సరఫరా చేస్తున్నాయి.
India Russia Trade: రహస్య నౌకా రవాణా (డార్క్ షిప్-టు-షిప్ బదిలీలు)
ఆగస్టులో రష్యాకు వెళ్లిన గ్యాసోలిన్లో 55 శాతం అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారానే సరఫరా అయింది. భారత్ నుంచి వెళ్లిన పెట్రోల్ కార్గోలు మధ్యధరా సముద్రంలో అత్యంత రహస్యంగా 'డార్క్ షిప్-టు-షిప్ (STS)' పద్ధతిలో బదిలీ అయ్యాయి. ఈ నౌకలు తమ గుర్తింపును దాచడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) సిగ్నల్స్ను నిలిపివేశాయి. ఇంధన కొరత నుంచి తప్పించుకునేందుకు రష్యా పెట్రోల్ ఎగుమతులపై 2027 జనవరి చివరి వరకు, డీజిల్ ఎగుమతులపై 2026 సెప్టెంబర్ 1 వరకు నిషేధాన్ని పొడిగించింది.
భారత్లో ముస్లింలకు చోటు లేదంటే.. అతడు హిందువే కాదు: మోహన్ భగవత్

