రైస్ మిల్లులను పరిశీలించిన అదనపు కలెక్టర్
ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సూచనలు
Medak district : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని రాచరాయ, సప్తగిరి రైస్ మిల్లులను జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
మిల్లుల వద్ద నిల్వలో ఉన్న ధాన్యం లోడ్ల పరిస్థితిని పరిశీలించి, హమాలీల సంఖ్యతో పాటు మిల్లుల్లో కొనసాగుతున్న పనులను ఆరా తీశారు. అదేవిధంగా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచనలు చేశారు.
Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!
Medak district కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తూకం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, అన్లోడింగ్ కార్యక్రమాల్లో సమన్వయంతో పని చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిల్లర్లు వై.రమేష్, సంతోష్ పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

