Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు జీలుగు, జనుము విత్తనాల పంపిణీ

రైతులకు జీలుగు, జనుము విత్తనాల పంపిణీ

వార్త 2 weeks ago

Choutkur Farmers: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని చౌట్కూర్ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో రైతులకు జీలుగు, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి ప్రవీణ తెలిపారు.

రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటు

రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. జీలుగు విత్తనాలు 30 కిలోల బస్తా రూ.2460లకు, జనుము విత్తనాలు 40 కిలోల బస్తా రూ.3120లకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: Gold Medal in WC-2026 : ఇషా సింగ్ కు సీఎం రేవంత్ అభినందనలు

Choutkur Farmers: అవసరమైన పత్రాలతో రావాలని సూచన

విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతో చౌటకూర్ ఆగ్రో రైతు సేవ కేంద్రానికి రావాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి ప్రవీణ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha