Dailyhunt
రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత!

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత!

వార్త 2 weeks ago

Vijaypat Singhania: ప్రముఖ వస్త్ర వ్యాపార దిగ్గజం, రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా (87) శనివారం ముంబయిలో కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆయన కుమారుడు, రేమండ్ గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ధృవీకరించారు.

ముంబయిలోని తన నివాసంలో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని, ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Read Also :Salaries of Workers : ఉద్యోగుల కంటే కార్మికుల జీతాలే భారీగా పెరుగుతున్నాయట !!

 Padma Bhushan Recipient, Adventurous Aviator Passes Away

Vijaypat Singhania: పద్మభూషణ్ గ్రహీత, సాహస ఏవియేటర్ ఇక లేరు

కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, విజయ్‌పత్ సింఘానియా సాహసోపేతమైన ఏవియేటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సుమారు 5000 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. ముఖ్యంగా 67 ఏళ్ల వయసులో హాట్ ఎయిర్ బెలూన్‌లో అత్యంత ఎత్తుకు ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.

20 ఏళ్ల పాటు రేమండ్ సంస్థకు సారథ్యం వహించిన వైనం

1980 నుండి 2000 వరకు సుమారు రెండు దశాబ్దాల పాటు రేమండ్ సంస్థను అగ్రపథంలో నడిపించిన విజయ్‌పత్, ఆ తర్వాత బాధ్యతలను తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించారు. తనకున్న 37 శాతం వాటాను కూడా కుమారుడికే బదిలీ చేశారు. మధ్యలో తండ్రీకొడుకుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తి కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ, చివరి దశలో వారు ఆ విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండటం విశేషం. ఆయన మృతి పట్ల పారిశ్రామిక వేత్తలు మరియు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ 'ప్రహార్' మెషిన్ గన్‌లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha