Bhuvanagiri crime: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కన్నప్రేమను మరచిన ఒక తండ్రి, తన రెండేళ్ల పసికందును గొంతు నులిమి హతమార్చాడు.
భార్యాభర్తల మధ్య చెలరేగిన కుటుంబ కలహాలే ఈ పసిప్రాణం బలి కావడానికి కారణమని తెలుస్తోంది.
Read Also:Maharashtra Crime:180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్!
Bhuvanagiri crime: Father strangles two-year-old daughter to death!
కుటుంబ కలహాలే కారణం
హనుమాపురం గ్రామానికి చెందిన శ్రీరాములుకు, అతని భార్యకు గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఉగాది పండుగ ముగించుకుని భార్య తన పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత వీరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన శ్రీరాములు, కన్నకూతురని కూడా చూడకుండా పాప గొంతు నులిమి చంపేశాడు.
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
నిందితుడు శ్రీరాములుకు పుట్టుకతోనే మాటలు రావు, చెవులు వినబడవు (మూగ, చెవుడు). చిన్నారిని హతమార్చిన అనంతరం నిందితుడు స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

