PM Modi Hyderabad visit: ప్రధాని నరేంద్ర మోదీ రేపు మన నగరానికి వస్తున్నారు. హైటెక్ సిటీలో కొత్తగా నిర్మించిన సింధూ హాస్పిటల్ను ఆయన ప్రారంభిస్తారు.
ప్రధాని పర్యటన కోసం పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరమంతా హై అలర్ట్ ప్రకటించి నిరంతరం నిఘా ఉంచారు.
PM Modi Hyderabad Visit Security Drill
PM Modi Hyderabad visit: గగనతలంపై ఆంక్షలు
మోదీ పర్యటించే ప్రాంతాల్లో భద్రత కోసం నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు డ్రోన్లు ఎగరేయడం పూర్తిగా నిషేధం. పారాగ్లైడర్లు వంటి విమాన వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నియమాలు మే 10 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయి.
సభకు భారీ బందోబస్తు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు వేలాది మంది వచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడ భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. సభకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
జూబ్లీహిల్స్లో వరుస దోపిడీలు.. నేపాలీ గ్యాంగ్లపై పోలీసుల ఫోకస్

