Dailyhunt
రోడ్డు ప్రమాదంలో జింక మృతి

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

వార్త 1 week ago

Sangareddy: సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ జాతీయ రహదారి 161 పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక జింక మృతి చెందింది.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జింకను పరిశీలించారు.

Read also: Bihar SDPO Raid: పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ విశాల్ కు సమాచారం అందించగా, ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని జింకకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో జింకను పూడ్చి పెట్టినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ మరియు సిబ్బంది తెలిపారు. అటవీ ప్రాంతాల సమీపంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కానిస్టేబుల్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha