Sai Durgha Tej: ఈ చిత్రాన్ని 'హనుమాన్' వంటి గ్లోబల్ బ్లాక్బస్టర్ అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
1980ల నాటి రాయలసీమ గ్రామీణ నేపథ్యంతో ఈ సినిమా కథ సాగనుంది. అణచివేతకు గురయ్యే గిరిజనుల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం వ్యవస్థపై ఎదురుతిరిగే 'బాలి' అనే పవర్ఫుల్ గిరిజన నాయకుడి పాత్రలో తేజ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Sai Durga Tej clarifies the delay of the movie 'Sambarala Etigattu'
Sai Durgha Tej: ఓటీటీల వల్ల మారిన ప్రేక్షకుల మైండ్సెట్
సినిమా ఆలస్యం కావడం వెనుక ఉన్న అసలు కారణాన్ని తేజ్ వివరిస్తూ.. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. “ప్రస్తుతం ఓటీటీల విప్లవం వల్ల ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విభిన్నమైన సినిమాలు, వెబ్సిరీస్లను విరివిగా చూస్తున్నారు. రకరకాల జానర్లలో వస్తున్న సరికొత్త అంతర్జాతీయ కంటెంట్ను ఫాలో అవ్వడం వల్ల, సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా మేకింగ్, స్క్రీన్ప్లే, కథలపై ఎంతో నాలెడ్జ్ పెరిగింది” అని తేజ్ గుర్తుచేశారు.
రొటీన్ కథలను జనాలు ఆదరించడం లేదు: అందుకే ఈ జాగ్రత్తలు
ప్రేక్షకులకు ఉన్న ఈ అపారమైన సినిమా నాలెడ్జ్ వల్లే, ఇప్పుడు తన సినిమాల విషయంలో తాను మునుపటి కంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేజ్ వెల్లడించారు. “పాతకాలపు రొటీన్ ఫార్ములా కథలను ఇప్పుడు జనాలు అస్సలు ఆదరించడం లేదు. వారిని థియేటర్లకు రప్పించి మెప్పించాలంటే కథల ఎంపిక, మేకింగ్లో అత్యంత పకడ్బందీగా వ్యవహరించక తప్పదు. కేవలం సినిమాలు వేగంగా పూర్తి చేయాలనే తొందర మాకు లేదు. ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతోనే 'సంబరాల ఏటిగట్టు' విషయంలో లేట్ అయినా సరే.. పక్కా కంటెంట్తోనే వస్తున్నాం” అని తేజ్ స్పష్టం చేశారు.

