కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) నేడు (మే 18, 2026) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించడంతో ఆయనకు సీఎం పీఠం దక్కింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read Also ; బెంగళూరు-ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు.. ప్రారంభించిన అశ్విని వైష్ణవ్!
CM Revanth Reddyహైదరాబాద్ నుండి కేరళకు రేవంత్ బృందం.. జాతీయ నేతల హాజరు!
ఈ ప్రతిష్టాత్మక ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఈ వేడుకకు విచ్చేస్తున్నారు. వీరు నిన్న రాత్రే హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి కేరళకు చేరుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఈ కార్యక్రమానికి హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపనున్నారు.
కూటమి నేతల మధ్య విస్తృత చర్చలు.. సరికొత్త పాలనకు శ్రీకారం!
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరగబోయే ఈ ప్రమాణ స్వీకార సభను కేవలం ఒక ప్రభుత్వ ఏర్పాటుగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని చాటేలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కొత్తగా కొలువుదీరనున్న 20 మంది మంత్రుల శాఖల కేటాయింపుపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ మరియు మిత్రపక్షాల నేతలు కసరత్తు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే వీడీ సతీశన్ నేతృత్వంలో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. కేరళ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక సంస్కరణలపైనే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

