Dailyhunt
సింధనూరులో నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. కుమారస్వామితో కలిసి భారీ బైక్ ర్యాలీ!

సింధనూరులో నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. కుమారస్వామితో కలిసి భారీ బైక్ ర్యాలీ!

వార్త 2 weeks ago

Nara Lokesh Sindhanur Visit: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని సింధనూరు పర్యటనలో అపూర్వ స్పందన లభించింది. దారిపొడవునా స్థానిక తెలుగు ప్రజలు, అభిమానులు, మరియు తెలుగు యువత ఆయనకు ఘనస్వాగతం పలికారు.

‘యువగళం’ జెండాలు చేతబూని ‘జై లోకేష్’ అంటూ చేసిన నినాదాలతో సింధనూరు వీధులు మారుమోగాయి. పూల వర్షం కురిపిస్తూ, అభిమాన గణాల మధ్య లోకేష్ తన పర్యటనను ఉత్సాహంగా కొనసాగించారు. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.

Read Also:Pithapuram Janasena Leader Attack: దళిత మహిళపై జనసేన నేత దాడి.. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

 Telugu Yuva is energized by Nara Lokesh’s tour

గజమాలలు, బైక్ ర్యాలీలతో హోరెత్తిన సింధనూరు

మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని సింధనూరులో భారీ ఏర్పాట్లు చేశారు. పీడబ్ల్యూయూడీ క్యాంప్, ఎల్లమ్మ దేవాలయం, మరియు అశోక్ భవన్ సర్కిల్ వద్ద గజమాలలతో ఆయనకు స్వాగతం పలికారు. సింధనూరు ఎమ్మెల్యే హంపన్న గౌడ, బీజేపీ నేత కరియప్ప, తెలుగు సంఘం నేత శోభన్ బాబు, మరియు మాజీ మంత్రి వెంకటరావు నాడగౌడ వంటి ప్రముఖులు లోకేష్‌కు ఘనంగా సత్కరించారు. ఎంజీ సర్కిల్ నుండి హోసళ్లీ క్యాంపు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Nara Lokesh Sindhanur Visit: కేంద్ర మంత్రులతో కలిసి ప్రచార రథంపై లోకేష్ సందడి

ఈ పర్యటనలో నారా లోకేష్‌తో పాటు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ కూడా పాల్గొన్నారు. వీరంతా కలిసి ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ బైక్ ర్యాలీలో భాగస్వాములయ్యారు. వివిధ పార్టీల నాయకులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు ఏకమై లోకేష్‌కు నీరాజనాలు పలికారు. గంగావతి రోడ్డులోని హోసల్లీ క్యాంప్ వద్ద భారీ గజమాలతో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రాజధాని చట్టభద్రత ఇక చిరస్థాయి.. మంత్రి లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha