Dailyhunt
సింగూర్ ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

సింగూర్ ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

వార్త 1 week ago

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టులో సోమవారం గుర్తుతెలియని గురుదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రాజెక్టు వద్దకు వెళ్లిన స్థానికులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించారు.

Read Also:Congress : ధాన్యం కొనలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - కేసీఆర్

Sangareddy Crime: వివరాలు తెలియాల్సి ఉంది

జోగుపేట సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ మృతుడి వివరాలు ఇంకా తెలియలేదని, ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి గుర్తింపుపై సమాచారం తెలిసిన పుల్కల్ పోలీస్ స్టేషన్‌ను సమాచారం ఇవ్వాలని కోరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha