Srikakulam Badam Milk Incident: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామీణ మండలం సింగుపురంలో కొండమ్మ తల్లి ఉత్సవాల వేళ బాదం పాలు వికటించి సుమారు 80 మంది అస్వస్థతకు గురవ్వడం ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
Read Also: Tirupati: తల్లిపాల నిధితో చిన్నారులకు పునర్జన్మ: జిల్లా కలెక్టర్
ఏం జరిగింది?
సింగుపురంలో ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన కొండమ్మ తల్లి ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య జరిగాయి. అయితే, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాతరలో ఒక వ్యాన్ ద్వారా విక్రయించిన బాదం పాలను పెద్ద సంఖ్యలో ప్రజలు తాగారు.గురువారం అర్ధరాత్రి నుండి పాలు తాగిన వారికి ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం మొదలయ్యాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 80 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉండటం గమనార్హం.
Badam Milk Poisoning Srikakulam Singupuram
Srikakulam Badam Milk Incident: వైద్య సేవలు,కలెక్టర్ స్పందన
ఘటన తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. బాధితులను శ్రీకాకుళం రిమ్స్ (RIMS) మరియు సమీపంలోని పీహెచ్సీలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. జాతరలో నాణ్యత లేని పానీయం అమ్మడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

