JC Prabhakar Reddy | తాడిపత్రి అర్బన్, జూన్ 16 (ప్రభాతవార్త): తాడిపత్రి అభివృద్ధే తన జీవిత లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువత క్రమశిక్షణతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని కూడా అలవర్చుకోవాలని సూచించారు.
యువత కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రపంచం వేగంగా మారుతోందని, ఉద్యోగ అవకాశాల స్వరూపం కూడా మారిపోతోందని అన్నారు. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు ప్రభావం పెరుగుతోందని, దానికి అనుగుణంగా యువత తమను తాము సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Kalyandurg News: అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యం!
మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న ఆయన, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపటి నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.
తాడిపత్రిపై తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, “తాడిపత్రి నా ప్రాణం” అని వ్యాఖ్యానించారు. పట్టణ అభివృద్ధి కోసం అవసరమైతే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజల సంక్షేమం కోసం ఎంత కష్టమైనా భరిస్తానని చెప్పారు.
పట్టణ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, తాడిపత్రిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, కానీ తాడిపత్రిలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
JC Prabhakar Reddy
తాడిపత్రిని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని, ప్రజల సహకారంతో మరిన్ని ప్రాజెక్టులను తీసుకొస్తామని తెలిపారు.
విద్యార్థుల కోసం అన్ని పాఠశాలల్లో మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

