Tadipatri crime: హేమచంద్ర హత్య కేసులో ఊహించని ట్విస్ట్. కేసు రీ కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులపై దాడి చేసిన నిందితుడు సర్వేశ్. సీఐ కానిస్టేబుల్ గాయాలు.
నిందితులపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని కోన ఉప్పలపాడుకు చెందిన ఏడు సంవత్సరాల బాలుడు హత్య చేసిన నిందితులు సర్వేశ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటనా స్థలానికి తీసుకువెళ్లిన సిఐ రామసుబ్బయ్య కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పై బీరు బాటల్ తో దాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో సర్వే కాళ్లకు గాయాలైనట్లు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి పేర్కొన్నారు.
Tadipatri crime: Accused Sarvesh sustains injuries to his legs.
పోలీసులు ఆత్మరక్షణ కోసం 6 రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడి కాళ్లకు గాయాలు.
యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో ఆస్తికోసం భార్య తమ్ముడును కిడ్నాప్ చేసే హత్య చేసిన సర్వేశ్ అనే నిందితుడిని సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అతను తిరిగిన ప్రదేశాలకు సిఐ రామసుబ్బయ్య సిబ్బందితో కలిసి తీసుకుని వెళ్లారు.యాడికి మండలం కుందన కోట సమీపంలోని అటవీ ప్రాంతం లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పక్కన పడి ఉన్న బీర్ బాటిల్ తీసుకొని సీ ఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పై బీర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. మొదట గాలిలోకి 2 రౌండ్లు మా సిఐ కాల్పులు జరిపిన నిందితుడు బీర్ బాటిల్ తో సీ.ఐ ,కానిస్టేబుల్ పై దాడి చేశాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం 6 రౌండ్లు కాల్పులు జరపడం తో సర్వీస్ రెండు కాళ్లకు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ సంఘటనలో గాయపడిన సిఐ రామసుబ్బయ్య కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ నిందితుడు సర్వేశ్ లను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై గతంలో ఒక హత్య కేసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
30 మంది బాలికలపై అత్యాచారం చేసిన బీజేపీ కార్పొరేటర్ కొడుకు అరెస్ట్?

