Dailyhunt
TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

వార్త 2 months ago

సంక్రాంతి పండుగ రద్దీనేపథ్యంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది.

కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG Crime) హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో,

Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడగా, బస్సులోని ప్రయాణికుల్లో 27 మందికి పైగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ కావడంతో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha