TDP Mahanadu 2026: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మక వార్షిక పండుగ 'మహానాడు-2026' అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.
ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ‘హైబ్రిడ్ విధానం’లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ, పార్టీ కేడర్లో మాత్రం పసుపు పండగ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి పెట్టని కోటగా ఉన్న మహిళలకు, రేపటి భవిష్యత్తు అయిన యువతకు ఈ మహానాడులో అగ్రతాంబూలం ఇచ్చారు. మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Read Also: Bhupathiraju Srinivasa Varma: ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్మ కీలక పర్యటన
TDP Mahanadu 2026
- బిల్లుతో సంబంధం లేకుండా: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా సరే.. తమ పార్టీ తరపున కచ్చితంగా 33 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని లోకేశ్ ప్రకటించారు.
- సోషల్ మీడియా వేదికగా: ఈ ఉదయమే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘బిగ్ అనౌన్స్మెంట్’ రాబోతోందని మంత్రి లోకేశ్ పోస్ట్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే మహానాడు వేదికపై మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
TDP Mahanadu 2026: హైబ్రిడ్ విధానంలో మహానాడు.. లక్షలాదిగా తరలివచ్చిన శ్రేణులు
“పసుపు జెండా – పేదవానికి అండ, ప్రగతికి అజెండా” అనే నినాదంతో ఈ రెండ్రోజుల మహానాడు షెడ్యూల్ను రూపొందించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ల నుంచి లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ మహా వేడుకలో భాగస్వాములయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ మహానాడు వేదికగా మొత్తం 20 కీలక రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు వ్యూహాలపై నేతలు కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఏపీ వైద్య విద్య డైరెక్టర్గా డాక్టర్ విష్ణువర్ధన్.. ప్రభుత్వం ఉత్తర్వులు!

