Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లా, సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన భౌతిక దాడి దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ దారుణ ఘటనకు బెంగాల్లోని అధికార బీజేపీ (BJP) ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Abhishek Banerjee attack
శనివారం సాయంత్రం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ప్రస్తుత పాలకులు హంతకులుగా మారారు. ఈ ఘటనకు బీజేపీ సిగ్గుపడాలి” అంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా ఆమె తన పోస్ట్కు జత చేశారు. ఎన్నికల అనంతర హింసలో ప్రాణాలు కోల్పోయిన టీఎంసీ కార్యకర్త సంజూ కర్మాకర్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన సమయంలో బీజేపీ మద్దతు ఉన్న అరాచక శక్తులు పథకం ప్రకారమే అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడికి తెగబడ్డారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
Read also: DK Shivakumar: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం
ఇది ప్రతీకార రాజకీయం: కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే
అభిషేక్ బెనర్జీపై జరిగిన ఈ దాడిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఒక ప్రముఖ ప్రతిపక్ష నేత పర్యటనకు కనీస పోలీస్ భద్రత కల్పించకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్ష నేతలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Abhishek Banerjee: పోలీసుల గైర్హాజరు వెనుక పెద్ద కుట్ర ఉంది: అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. టీఎంసీ కీలక నేతపై జరిగిన ఈ హత్యాప్రయత్నం బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం కేవలం ద్వేషపూరిత, హింసాత్మక రాజకీయాలు మాత్రమే చేయగలదని నిరూపించిందని విమర్శించారు. అంత సున్నితమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో కనీసం పోలీసులు అందుబాటులో లేకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
బాబా రాందేవ్కు భారీ షాక్..పతంజలి ఉత్పత్తులను సీజ్ చేసిన ఎఫ్డీఏ అధికారులు

