Tirumala Express: ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖపట్నం నుంచి కడప వరకు నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ (18521/18522) సేవలను ఇప్పుడు గుంతకల్లు వరకు పెంచారు.
మే 12 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలోని మరిన్ని జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ఉత్తరాంధ్ర నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగిస్తుంది. ప్రయాణికులు ఈ తాజా మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
Read also: Tirupati Digi Rythu Bazar: తిరుపతి వాసుల కోసం డిజి రైతు బజార్.. ఇంటికే తాజా కూరగాయలు!
Tirumala Express train at station.
Tirumala Express: కొత్త షెడ్యూల్ మార్పులు.. వచ్చే పోయే టైమింగ్స్ ఇవే!
కొత్త షెడ్యూల్ ప్రకారం విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. దారిలో కడపకు ఉదయం 7 గంటలకు, తాడిపత్రికి 8:33 గంటలకు ఈ రైలు వస్తుంది. తిరుగు ప్రయాణంలో గుంతకల్లులో మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30కి విశాఖ చేరుకుంటుంది. ఈ పొడిగింపు వల్ల ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి స్టేషన్ల ప్రయాణికులకు నేరుగా విశాఖ వెళ్లే అవకాశం దక్కింది. సుదీర్ఘ కాలంగా రైల్వే వినియోగదారులు కోరుతున్న డిమాండ్ను అధికారులు ఈ విధంగా నెరవేర్చారు.
మైసూర్ – కాకినాడ స్పెషల్ రైలు ఇకపై రెగ్యులర్ సర్వీస్!
తిరుమల ఎక్స్ప్రెస్తో పాటు మైసూర్ నుంచి కాకినాడ టౌన్ మధ్య నడిచే స్పెషల్ రైలును కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇప్పుడు ఈ రైలు (17289/17290) వారానికి రెండు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కాకినాడలో సోమ, శుక్రవారాల్లో బయలుదేరి విజయవాడ, సికింద్రాబాద్, అనంతపురం మీదుగా మైసూర్ చేరుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ రూట్లో రైలును శాశ్వతం చేయడం వల్ల ప్రయాణికులకు బెర్తుల లభ్యత పెరుగుతుంది. ప్రయాణ సమయాలు, ఆగే స్టేషన్ల గురించి అధికారిక వెబ్సైట్లో సరిచూసుకోవాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

