Dailyhunt
తీస్తా ఒప్పందంపై కొత్త ఆశలు పెంచిన బెంగాల్ ఫలితం

తీస్తా ఒప్పందంపై కొత్త ఆశలు పెంచిన బెంగాల్ ఫలితం

వార్త 2 days ago

శ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయంతో కొత్త చర్చ

West bengal election : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో కూడా చర్చకు దారితీశాయి.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై కొత్త ఆశలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తీస్తా నది జలాల ఒప్పందంపై ఆసక్తి పెరిగింది.

తీస్తా జలాల వివాదంపై పెరిగిన ఆశలు

గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీస్తా జలాల వివాదం పరిష్కారానికి ఇప్పుడు మార్గం సుగమమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రం మరియు కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ వర్గాలు కూడా ఈ పరిణామాన్ని సానుకూలంగా చూస్తున్నాయి.

Read Also:SBI : సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!

 West bengal election

భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కీలక దశ

తీస్తా వివాదం కేవలం నీటి పంపిణీ సమస్య మాత్రమే కాదు. ఇది భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలకు కూడా కీలక అంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీవీకే ఎమ్మెల్యేగా తెలుగు మహిళా సంచలనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha