Dailyhunt
ట్రంప్ దయ వల్లే ఇరాన్ బతికింది- హెగ్సెత్

ట్రంప్ దయ వల్లే ఇరాన్ బతికింది- హెగ్సెత్

వార్త 1 week ago

ట్రంప్ దయ వల్లే ఇరాన్ బతికిందా?

Pete hegseth iran war : అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ అమెరికా ముందు ప్రాధేయపడిందని ఆయన ఆరోపించారు.

నిమిషాల వ్యవధిలోనే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేసే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయతో శాంతికి అవకాశం ఇచ్చారని చెప్పారు.

ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ ప్రభావం

అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ' అద్భుత విజయాన్ని సాధించిందని హెగ్సెత్ పేర్కొన్నారు. ఈ దాడుల్లో మంగళవారం రాత్రి ఏకంగా 800 లక్ష్యాలపై అమెరికా దళాలు దాడులు చేశాయని తెలిపారు. ఇరాన్ రక్షణ కేంద్రాలు, అణు పరిశ్రమ స్థావరాలు, ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయని వివరించారు.

Read Also: Nellore: ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

 Pete hegseth iran war

ఇరాన్ నాయకత్వానికి భారీ దెబ్బ

ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సంయుక్తంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. ఈ పరిణామాలతో ఇరాన్ సైన్యం నైతిక స్థైర్యం కోల్పోయిందని, ఇకపై క్షిపణుల తయారీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని హెగ్సెత్ పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పట్టపగలు తనిఖీ పేరుతో బంగారం షాపులో లూటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha