Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణం.. సీఎం

త్వరలోనే మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణం.. సీఎం

వార్త 2 weeks ago

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో వేగంగా దూసుకుపోతున్నామని, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన విధానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పార్టీలన్నీ ఏకమయ్యాయని, ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పాలనను నిరంతరం అందిస్తామని స్పష్టం చేశారు.

Read Also : Tirupati Flight Schedule Change: తిరుపతి విమానాల షెడ్యూల్ మార్పు.. కొత్త షెడ్యూల్ వివరాలు

 Free AC bus travel for women soon: CM

CM Chandrababu: రెండేళ్లలో సంక్షేమానికి భారీగా ఖర్చు.. పింఛన్లకే రూ. 73 వేల కోట్లు

రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సీఎం పేర్కొన్నారు:

  • సంక్షేమ వ్యయం: గత రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం రూ. 1.50 కోట్లు (లక్షల కోట్ల) వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.
  • ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: ఒక్క పింఛన్ల పంపిణీ రూపంలోనే లబ్ధిదారులకు రూ. 73,000 కోట్లు అందించామని సీఎం వివరించారు.

మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణ హామీ

రాష్ట్ర ప్రజల రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు త్వరలోనే పెద్ద ఎత్తున ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ నూతన ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బస్టాండ్ వెళ్లే పని లేకుండా ఆర్టీసీ కొత్త సేవలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha