Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..రెండవ ప్రమాద హెచ్చరిక జారీ!

ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..రెండవ ప్రమాద హెచ్చరిక జారీ!

వార్త 1 week ago

Bhadrachalam Godavari Second Danger Warning: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది.

నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక (Second Danger Warning) జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also : Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. ప్రమాద హెచ్చరిక జారీ

 Godavari surging menacingly; second danger warning issued!

Bhadrachalam Godavari Second Danger Warning: 11.44 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతాలకు 11.44 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

సనత్‌నగర్ టిమ్స్‌కు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha