Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క చదువుపై తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు.
వయస్సుతో గానీ, తాను అనుభవిస్తున్న ఉన్నత అధికార హోదాతో గానీ సంబంధం లేకుండా.. మనిషి అనుకుంటే నిరంతర విద్యార్థిగా సాగవచ్చని ఆమె నిరూపించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ పీజీఎల్సెట్ (PGLCET) ప్రవేశ పరీక్షకు ఆమె స్వయంగా హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Despite holding a high position.. a minister who wrote the LLM entrance!
Minister Seethakka: గతంలోనే ఎల్ఎల్బీ, మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘కాన్స్టిట్యూషనల్ లా’ విభాగంలో ఎల్ఎల్ఎమ్ కోర్సును చేయడం కోసం సీతక్క ఈ ప్రవేశ పరీక్ష రాశారు. హైదరాబాద్ మౌలాలీలోని ఒక పరీక్షా కేంద్రంలో ఆమె స్వయంగా కూర్చుని ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షను పూర్తి చేశారు. సాధారణంగా నిరంతరం రాజకీయాల్లో, ప్రజల్లో బిజీగా ఉండే నేతలు చదువు గురించి ఆలోచించడమే అరుదు. అలాంటిది కీలకమైన మూడు ప్రభుత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ కూడా సీతక్క చదువు విషయంలో చూపిస్తున్న శ్రద్ధ, క్రమశిక్షణ అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తోంది.
మంత్రి సీతక్కకు గతంలోనే న్యాయశాస్త్రంపై పట్టు సాధించేందుకు ఆమె 2001 లోనే ఎల్ఎల్బీ (LLB) పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘కార్పొరేట్ లా’ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (LLM) కూడా పూర్తి చేశారు. ఇంతటితో ఆగకుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ సాధించి ‘డాక్టరేట్’ అందుకున్నారు. అయితే, దేశ రాజ్యాంగంపై ఉన్న ప్రత్యేక ఆసక్తి కారణంగా.. ఇప్పటికే ఎన్నో ఉన్నత డిగ్రీలు, డాక్టరేట్ ఉన్నప్పటికీ, ఆమె ఇప్పుడు ‘కాన్స్టిట్యూషనల్ లా’ లో మరో ఎల్ఎల్ఎమ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే ఆమె మళ్లీ విద్యార్థిగా మారి ఎంట్రన్స్ పరీక్ష రాయడం విశేషం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

