Masayipet Crime: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య కు పాల్పడిన ఘటన మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి పులిగుట్ట తండాలో చోటు చేసుకుంది. చెట్ల తిమ్మాయిపల్లి కి చెందిన బానోతు సునీత (24) కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది.
కుటుంబ కలహాల కారణంగా భర్త తో గొడవ పడి గత ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తున్నది. ఆమెకు పెళ్ళైన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక్కతే ఒంటరిగా జీవిస్తూ, తన ఆర్థిక పరిస్థితులు బాగో లేక మనస్తాపం చెంది, తన రేకుల రూములో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. మృతురాలి తల్లి అయిన బానోతు అంశి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చేగుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Uttarakhand Road Accident: లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 8 మంది దుర్మరణం
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
సినిమా ఫక్కీలో భర్త హత్యకు ప్లాన్.. చివరకు పోలీసులకు చిక్కిన భార్య

