Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు కోటి రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలి: జగన్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు కోటి రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలి: జగన్

వార్త 3 days ago

YS Jagan: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు చట్టబద్ధంగా అందే నిధులతో సంబంధం లేకుండా.. ప్రభుత్వం అదనంగా కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన పట్టుబట్టారు.

బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత

విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం, బాధితుల కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత జూన్ 8న వీఎస్పీలోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1)లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ పేలిపోయిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, పలువురు తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే.

Read also: AP Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

YS Jagan: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అసంతృప్తి

ఈ ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రభుత్వ తరఫున పరిహారం ప్రకటించారు. అయితే, ఈ ప్యాకేజీపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికులకు చట్టప్రకారం దక్కాల్సిన బీమా, ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ వంటి సొమ్మును (సుమారు రూ. 1.45 కోట్లు) కూటమి ప్రభుత్వం తమ సొంత సాయంగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తు చేస్తూ హామీ

“మా పాలనలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగినప్పుడు.. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాం. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించాలి” అని జగన్ డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని జగన్ కోరారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం స్పందించకపోతే.. భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఉద్యోగ హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

అభివృద్ధే అమిలినేని సురేంద్రబాబు అజెండా: టీడీపీ నేతలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha