Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాల వేళ హెచ్చరిక.. కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు

వర్షాల వేళ హెచ్చరిక.. కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు

వార్త 1 week ago

Rajasthan electrocution incident: వర్షాకాలంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు, అలాగే ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు, వాటిని తాకకూడదు.

పొరపాటున కూడా వాటికి దగ్గరగా వెళితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి తీవ్ర విషాదకర సంఘటనే రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read Also : Bus Driver : బస్ డ్రైవర్ ఇంట్లో 20 కోట్ల నగదు, 15KGల బంగారం!

 Warning during rains: Do not touch electric poles.

Rajasthan electrocution incident: రాజస్థాన్‌లో విషాదం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

రాజస్థాన్ టోంక్ జిల్లాలో వర్షం నీటితో నిండిపోయిన ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి, నీటిలో విద్యుత్ ప్రసరించడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచినప్పుడు విద్యుత్ లైన్ల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

వర్షాల సమయంలో రోడ్లపై ప్రయాణించేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వేలాడుతున్న విద్యుత్ వైర్లు, లేదా నీటిలో కరెంట్ లీకేజీ ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

డీమార్ట్ లో 20 శాతం డిస్కౌంట్ తో మందులు లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha