Veldurthi Medak Road: వెల్దుర్తి నుండి మెదక్ వెళ్లే రోడ్డు గుంతలు పడి ధ్వంసం కావడంతో రోడ్డు విస్తరణతో పాటు రోడ్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి పనులు జరపాలంటూ సోమవారం నాడు వెల్దుర్తి స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి టిఆర్ఎస్ శ్రేణులు.
నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోపాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు. మాజీ ప్రతినిధులు. నాయకులు. తరలివచ్చారు.
Read Also : Papannapet School: పాపన్నపేట స్కూళ్లో కలకలం.. ఉపాధ్యాయుడిపై 'బ్యాడ్ టచ్' ఆరోపణలు!
BRS protest from Veldurthi to Medak Collectorate
Veldurthi Medak Road: శెట్టిపల్లి కలాన్ వరకు కొనసాగిన పాదయాత్ర
రోడ్డు దుస్థితిని వివరిస్తూ శెట్టిపల్లి కలాన్ గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రోడ్డుకు నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధి చేయడం లేదంటూ ఆమె విమర్శించారు. శెట్టిపల్లి నుండి మెదక్ కలెక్టరేట్ వరకు కొనసాగుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ BRS ఇన్చార్జి ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, మండల BRS పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

