Dailyhunt
విదేశీ నిధుల పేరుతో రూ. 3 కోట్ల వసూలు.. వైసీపీ నాయకుడిపై కేసు!

విదేశీ నిధుల పేరుతో రూ. 3 కోట్ల వసూలు.. వైసీపీ నాయకుడిపై కేసు!

వార్త 1 week ago

Kalyanadurgam Financial Fraud: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ధి గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నకిలీ బ్యాంకు పత్రాలు చూపించి కోట్లలో అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి ఆర్థిక నేరానికి పాల్పడినట్లు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పట్టణ సీఐ హరినాథ్ కథనం మేరకు తన బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలలో విదేశీ నిధులు జమ అయ్యాయని వాటిని బ్యాంకు(Bank) నుండి తీసుకునేందుకు లక్షల్లో డబ్బులు చెల్లించాలని అమాయక ప్రజలను నమ్మించి కమిషన్ ఇస్తానని ప్రజల నుండి మూడు కోట్ల మేరకు వసూలు చేసినట్లు తెలిపారు. బ్యాంకు మేనేజర్ తో పాటు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Read Also :Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం!

 Kalyanadurgam Financial Fraud: Rs. 3 crore collected in the name of foreign funds.. Case against YCP leader!

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రక్కు-కారు భీకరంగా ఢీకొని ఏడుగురు మృతి.. సురేంద్రనగర్‌లో విషాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha