Hormuz Strait: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ప్రపంచ ఇంధన రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.
ఈ ఉద్రిక్తతల కారణంగా ఆసియా ప్రాంతంలో సుమారు 50 ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్లు ఎక్కడికక్కడే ఖాళీగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: Iran-USA War: ట్రంప్ పై 25వ సవరణ చర్చ ..అందరి చూపులు జె.డి. వాన్స్ పైనే..
War effect.. 50 LNG ships empty in the Asian region
గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా ఉన్న ఖతార్లోని రస్ లఫాన్ పరిశ్రమపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించడంతో, ఇక్కడి గ్యాస్ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ లోడింగ్ కోసం రస్ లఫాన్ వెళ్లిన పదుల సంఖ్యలో నౌకలు, జలసంధి మూసివేతతో హర్మూజ్ వద్దే చిక్కుకుపోయాయి.
Hormuz Strait: సముద్ర జలాల్లో ఖాళీగా దర్శనమిస్తున్న ట్యాంకర్లు
ప్రస్తుతం భారత్, శ్రీలంక తీర ప్రాంతాలతో పాటు, మలక్కా జలసంధి ఉత్తర ప్రవేశ ద్వారం వద్ద, సింగపూర్కు తూర్పున ఉన్న జలాల్లో ఈ ఎల్ఎన్జీ ట్యాంకర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 ఎల్ఎన్జీ ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, అందులో గణనీయమైన సంఖ్యలో నౌకలు సరుకు లేక నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్యాస్ ఎగుమతులు పునఃప్రారంభం కాకపోతే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

