Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతి ఇంటిపై  ప్రేమోన్మాది కిరోసిన్ సీసాలతో దాడి!

యువతి ఇంటిపై ప్రేమోన్మాది కిరోసిన్ సీసాలతో దాడి!

వార్త 2 weeks ago

Coimbatore Thondamuthur Crime: తమిళనాడులోని కోయంబత్తూరు (Coimbatore) జిల్లా తొండముత్తూరు సమీపంలో తీవ్ర కలకలం రేగింది. ఒక రౌడీ షీటర్ తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో..

సదరు యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల తరహాలో కిరోసిన్ నింపిన మద్యం సీసాలను విసిరి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 31 క్రిమినల్ కేసులు ఉన్న చెన్నైకి చెందిన ఒక మోస్ట్ వాంటెడ్ హిస్టరీ షీటర్‌తో పాటు అతని ముగ్గురు అనుచరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read Also :Dhule Laling Ghat Accident: లళింగ్ ఘాట్‌లో ట్రక్కులను ఢీకొట్టిన లగ్జరీ బస్సు.. ఆరుగురు దుర్మరణం!

ప్రేమ వల.. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ తెలియడంతో బ్రేకప్

 Rowdy Sheeter Kerosene Bottle Attack

పోలీసుల కథనం ప్రకారం.. తొండముత్తూరు సమీపంలోని కాళికానాయకన్‌పాళయం, సీబీసీ గార్డెన్ నివాసి అయిన సుందరమూర్తి తలియూర్ టౌన్ పంచాయతీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె కోయంబత్తూరులోని ఒక కాలేజీలో చదువుకుంటున్న సమయంలో చెన్నైకి చెందిన కార్తీక్ అలియాస్ మరియప్పన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, కొన్ని రోజుల తర్వాత కార్తీక్ సాధారణ యువకుడు కాదని, అతనిపై తమిళనాడువ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో హత్యలు, దోపిడీలతో కూడిన ఏకంగా 31 క్రిమినల్ కేసులు ఉన్నాయనే షాకింగ్ నిజం ఆ యువతికి తెలిసింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె.. కార్తీక్‌తో ఉన్న ప్రేమ వ్యవహారానికి వెంటనే స్వస్తి చెప్పి, దూరంగా ఉండటం ప్రారంభించింది. అయినప్పటికీ, తనతోనే రిలేషన్‌లో ఉండాలంటూ కార్తీక్ ఆమెను నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు.

Coimbatore Thondamuthur Crime అర్ధరాత్రి కిరోసిన్ సీసాలతో దాడి.. కాలిన బూట్ల స్టాండ్

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కార్తీక్ తన ముగ్గురు అనుచరులతో కలిసి కేటీఎం (KTM), బజాజ్ పల్సర్ బైక్‌లపై యువతి నివాసానికి చేరుకున్నాడు. ఇంటి బయట నిలబడి ఉన్న యువతి తండ్రి సుందరమూర్తిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా, తాము వెంట తెచ్చుకున్న కిరోసిన్ నింపిన బీరు సీసాలకు నిప్పు పెట్టి ఇష్టారాజ్యంగా ఇంటిపైకి విసిరారు. అందులో ఒక సీసా పెద్ద శబ్దంతో పేలి ఇంటి ముఖద్వారం (పోర్టికో) లో ఉన్న షూ స్టాండ్‌పై పడింది. దీంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగి స్టాండ్‌లో ఉన్న కాన్వాస్ బూట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దాడి అనంతరం నిందితులు బైక్‌లపై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు సుందరమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొండముత్తూరు పోలీసులు కార్తీక్ మరియు అతని గ్యాంగ్‌పై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటన స్థానిక నివాసితులలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సీఎం విజయంపై అసభ్య పోస్ట్.. యాపిల్ సంస్థ ఉద్యోగి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha