Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్ మే11 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు.

కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఈరోజు (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. శాస్త్రీయంగా కనీస వేతనాల సవరణ చేపడతామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల కనీస వేతన విధానాలపై సమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు. కేవలం అంకెల్లో కాదని.. వాస్తవ అవసరాలకు తగ్గట్టే వేతనాలు ఉండాలని చెప్పుకొచ్చారు. దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లాభం చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు. అన్నివర్గాల అభిప్రాయాలతో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy