Dailyhunt
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(02.04.2026) తెలుగులో..

అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(02.04.2026) తెలుగులో..

SAKSHI EDUCATION 0 months ago
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా చరిత్రలో ఒక కీలక ఘట్టం నమోదైంది. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు తెరదించుతూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
  • 2014లో రాష్ట్ర విభజన సమయంలో సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు ముగియడంతో, ఆంధ్రప్రదేశ్‌కు సొంత రాజధానిని ఖరారు చేస్తూ ఈ సవరణ చేపట్టారు.
  • సెక్షన్ 5 మార్పు: పాత నిబంధనల స్థానంలో అమరావతిని ఏకైక రాజధానిగా స్పష్టం చేస్తూ కొత్త నిబంధనలను చేర్చారు.
  • ముందస్తు అమలు (Retrospective Effect): ఈ చట్ట సవరణ జూన్ 2, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.
  • గత ప్రభుత్వ హయాంలో (2019-2024) తీసుకువచ్చిన 'వికేంద్రీకరణ' లేదా 'మూడు రాజధానుల' ప్రతిపాదనకు ఈ నిర్ణయంతో పూర్తిగా స్వస్తి పలికారు. గతంలో విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శానససభ), కర్నూలు (న్యాయ) రాజధానులుగా ఉండాలని తీసుకున్న నిర్ణయం అనేక న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది.
  • ప్రస్తుతం లోక్‌సభ ఆమోదించిన తీర్మానంతో అమరావతి సర్వాధికారాలు కలిగిన ఏకైక రాజధానిగా అవతరించింది.
  • నిర్ణయం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014) సవరణ ద్వారా అమరావతి ఏకైక రాజధానిగా గుర్తింపు.
  • అమలు తేదీ: జూన్ 2, 2024 (Retrospective effect).
  • ఉమ్మడి రాజధాని గడువు: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు జూన్ 2, 2024తో ముగిసింది.
  • మునుపటి మోడల్: గతంలో ప్రతిపాదించిన మూడు రాజధానుల (విశాఖ, అమరావతి, కర్నూలు) విధానం రద్దు.
  • చారిత్రక ప్రాధాన్యత: శాతవాహనుల కాలం నాటి చారిత్రక వైభవం కలిగిన ప్రాంతం అమరావతి, ఇప్పుడు ఆధునిక ఏపీకి అధికారిక కేంద్రం.
  • అంతరిక్ష రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 1972 నాటి అపోలో మిషన్ల తర్వాత, తొలిసారిగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఆర్టెమిస్-II నౌకను నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఏప్రిల్ 1, 2026న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి శక్తివంతమైన 'స్పేస్ లాంచ్ సిస్టమ్' (SLS) రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.
  • ఈ మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అవ్వదు, కానీ చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి చేరుకుంటుంది.
  • కాలపరిమితి: 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం.
  • పరీక్షలు: భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను దించడానికి అవసరమైన లైఫ్ సపోర్ట్, కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ వ్యవస్థలను ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తారు.
  • దూరం: భూమి నుండి దాదాపు 2,52,799 మైళ్ల దూరానికి చేరుకుని, గతంలో 'అపోలో-13' నెలకొల్పిన రికార్డును ఈ మిషన్ అధిగమించనుంది.
  • ఈ మిషన్‌లో పాల్గొంటున్న నలుగురు వ్యోమగాములు అంతరిక్ష చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు.
  • రీడ్ వైజ్‌మాన్ (కమాండర్): మిషన్ నాయకత్వం.
  • విక్టర్ గ్లోవర్ (పైలట్): చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న తొలి నల్లజాతీయుడు.
  • క్రిస్టినా కోచ్: చంద్రుడి చెంతకు చేరుకోనున్న తొలి మహిళ.
  • జెరెమీ హాన్సెన్: చంద్రుడి మిషన్‌లో పాల్గొంటున్న తొలి అమెరికాయేతర (కెనడా) వ్యోమగామి.
  • SLS రాకెట్: 8.8 మిలియన్ పౌండ్ల థ్రస్ట్‌తో దూసుకెళ్లిన ఈ రాకెట్, వ్యోమగాములను మోసుకెళ్తున్న ఓరియన్ (Orion) నౌకను కక్ష్యలోకి చేర్చింది.
  • ఫ్రీ-రిటర్న్ పథం: ఒకవేళ ప్రయాణంలో ఇంజిన్ సమస్యలు తలెత్తినా, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేలా ఈ నౌక పథాన్ని రూపొందించారు.
  • ప్రయోగ తేదీ: ఏప్రిల్ 1, 2026.
  • రాకెట్ పేరు: స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) - ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్.
  • నౌక పేరు: ఓరియన్ (Orion) స్పేస్‌క్రాఫ్ట్.
  • రికార్డు: భూమికి అత్యంత దూరంగా (Farthest distance) ప్రయాణించిన మానవ సహిత నౌకగా ఆర్టెమిస్-II నిలవనుంది.
  • తదుపరి అడుగు: ఆర్టెమిస్-II విజయవంతమైతే, 2028లో ఆర్టెమిస్-III ద్వారా చంద్రుడిపై మానవులను ల్యాండ్ చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
  • భారత సైన్యం ఆధునీకరణ, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతున్న కీలక సమయంలో, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS) గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆపరేషనల్ నాయకత్వం కలిగిన ఆయన రాకతో భారత సైనిక వ్యూహాలు మరింత పటిష్టం కానున్నాయి.
  • లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆర్మీలోని 'ఆర్మర్డ్ కోర్' (Armoured Corps) లో నియమితులయ్యారు. తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్లను, వ్యూహాత్మక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా ఆయనకు పేరుంది.
  • ఆయన కెరీర్‌లో వివిధ భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసిన అపార అనుభవం ఉంది.
  • మెకనైజ్డ్ వార్‌ఫేర్: ఎడారి ప్రాంతాల్లో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించి, యుద్ధ తంత్రాల్లో తన నైపుణ్యాన్ని చాటారు.
  • కౌంటర్ ఇన్సర్జెన్సీ: జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటు వ్యతిరేక దళానికి (Counter Insurgency Force) నేతృత్వం వహించి, అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించారు.
  • ముఖ్యమైన పదవులు: దక్షిణ భారత ప్రాంతంలో సుదర్శన్ చక్ర కోర్ కమాండర్‌గా మరియు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • ధీరజ్ సేథ్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా, వ్యూహాత్మక మరియు విద్యా రంగాల్లోనూ రాణించారు.
  • ఐక్యరాజ్యసమితి మిషన్: అంగోలాలో జరిగిన UN మిషన్‌లో ఆపరేషన్స్ ఆఫీసర్‌గా సేవలందించారు.
  • శిక్షణ: పారిస్‌లో అంతర్జాతీయ కోర్సుతో పాటు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో 'బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్' మెడల్‌ను గెలుచుకున్నారు.
  • నియామకం: భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ (Vice Chief of Army Staff).
  • విభాగం: ఆర్మర్డ్ కోర్ (1986 బ్యాచ్).
  • భారతదేశం తన పన్ను పరిపాలనను ఆధునీకరించే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్‌ను భారీగా వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టిన 'ప్రాజెక్ట్ ఇన్‌సైట్' (Project Insight) ద్వారా పన్ను ఎగవేతదారుల ఆటకట్టించడంతో పాటు, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది.
  • అయితే, ఇదే సమయంలో గోప్యత, అల్గారిథమిక్ పక్షపాతంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
  • ఆదాయపు పన్ను శాఖ 2017లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, 2019 నుంచి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
  • INTRAC: ఇది ఈ వ్యవస్థకు వెన్నెముక వంటిది. ఇది పన్ను లావాదేవీలను విశ్లేషించే ప్రధాన ఇంజిన్.
  • CMCPC: ఇన్ట్రాక్ (INTRAC) ఇచ్చే డేటా ఆధారంగా ఆదాయాన్ని తక్కువగా చూపిన వారిని గుర్తిస్తుంది.
  • NUDGE వ్యూహం: ఒక వ్యక్తి ఖర్చులు లేదా ఆర్థిక కార్యకలాపాలు, వారు దాఖలు చేసిన రిటర్న్స్‌తో సరిపోలకపోతే.. వారికి SMS లేదా ఈమెయిల్ ద్వారా గుర్తుచేసి (Reminders), స్వచ్ఛందంగా వివరాలు సరిచేసుకునేలా ప్రోత్సహిస్తుంది.
  • రిస్క్ ప్రొఫైలింగ్: పన్ను ఎగవేతకు అవకాశం ఉన్న కేసులను ఏఐ త్వరగా గుర్తిస్తుంది.
  • వనరుల వినియోగం: చిన్న చిన్న కేసుల కంటే, భారీ ఎత్తున పన్ను ఎగవేత జరిగే కేసులపై అధికారులు దృష్టి సారించేలా చేస్తుంది.
  • మెరుగైన సేవలు: స్మార్ట్ చాట్‌బాట్‌ల ద్వారా పన్ను చెల్లింపుదారుల సందేహాలను తీర్చడం మరియు రిటర్న్స్ ఫైలింగ్‌ను సులభతరం చేయడం.
  • డేటా గోప్యత: అత్యంత సున్నితమైన ఆర్థిక డేటా ఒకే చోట ఉండటం వల్ల సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంది. 2025లో భారతీయులు ఇటువంటి డిజిటల్ ఆర్థిక నేరాల వల్ల దాదాపు 22,495 కోట్ల డాలర్లు కోల్పోయారు.
  • అల్గారిథమిక్ బయాస్: పాత డేటా ఆధారంగా ఏఐ పనిచేయడం వల్ల కొన్నిసార్లు నిర్దిష్ట వర్గాలపై లేదా ప్రాంతాలపై పక్షపాతం చూపే అవకాశం ఉంది.
  • జవాబుదారీతనం: ఒక వ్యక్తిని ఏఐ ఎందుకు ఫ్లాగ్ (Flag) చేసిందో స్పష్టమైన కారణాలు తెలియకపోవడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడుతున్నారు.
  • ప్రాజెక్ట్ పేరు: ప్రాజెక్ట్ ఇన్‌సైట్ (Project Insight).
  • కీలక విభాగం: ఆదాయపు పన్ను లావాదేవీల విశ్లేషణ కేంద్రం (INTRAC).
  • NUDGE విధానం: పన్ను చెల్లింపుదారులను స్వచ్ఛందంగా తప్పులు సరిదిద్దుకునేలా ప్రోత్సహించే నాన్-ఇంట్రూసివ్ పద్ధతి.
  • ముఖ్య ఉద్దేశ్యం: పన్ను ఎగవేతను అరికట్టడం మరియు పన్ను వసూళ్లను (Revenue Mobilisation) పెంచడం.
  • దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గిరిజన క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాతీయ స్థాయి క్రీడా సంబరం 'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్' చత్తీస్‌గఢ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 3, 2026 వరకు జరిగే ఈ క్రీడలు గిరిజన ప్రాంతాల్లోని అపారమైన క్రీడా ప్రతిభను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒక వారధిగా నిలవనున్నాయి.
  • ఈ క్రీడలను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) మరియు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
  • ప్రధాన వేదికలు: రాయ్‌పూర్, జగదల్‌పూర్ మరియు సుర్గుజా.
  • ప్రమాణాలు: ఈ పోటీలను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు.
  • మస్కట్ (Mascot): గిరిజనుల గర్వం, అస్తిత్వం మరియు ధైర్యసాహసాలకు ప్రతీకగా 'మోర్‌వీర్' (Morveer) ను మస్కట్‌గా ప్రకటించారు.
  • క్రీడలు: అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ (విలువిద్య), స్విమ్మింగ్ మరియు రెజ్లింగ్ వంటి ఏడు పతక క్రీడలతో పాటు.. కబడ్డీ, మల్లఖంబ్ వంటి స్వదేశీ క్రీడలను కూడా ఇందులో చేర్చారు.
  • పాల్గొనేవారు: దేశవ్యాప్తంగా సుమారు 60,000 మంది క్రీడాకారులు 338 పతకాల కోసం పోటీ పడుతున్నారు.
  • మెరిట్ ప్రాతిపదికన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు రెండంచెల విధానాన్ని అనుసరించారు. మొదట రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో ట్రయల్స్ నిర్వహించి, ఆపై స్పోర్ట్స్ ఫెడరేషన్ల ద్వారా జాతీయ స్థాయి ట్రయల్స్ నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేశారు.
  • ఈవెంట్ పేరు: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ (KITG) 2026.
  • నిర్వహణ కాలం: మార్చి 25 నుండి ఏప్రిల్ 3, 2026 వరకు.
  • ఆతిథ్య రాష్ట్రం: చత్తీస్‌గఢ్.
  • మస్కట్: మోర్‌వీర్ (Morveer).
  • లక్ష్యం: గిరిజన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపైకి తీసుకురావడం.
  • మొత్తం పతకాలు: 338.
  • ప్రతి ఏటా ఏప్రిల్ 2వ తేదీని ఐక్యరాజ్యసమితి 'ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం'గా ప్రకటించింది. ఆటిజం ఉన్న వ్యక్తుల పట్ల సమాజంలో అవగాహన పెంచడం, వారిని గౌరవంగా స్వీకరించడం, వారి హక్కుల కోసం పోరాడడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. 2007లో ఐక్యరాజ్యసమితి దీనిని ప్రారంభించగా, నాటి నుంచి నేటి వరకు ఇది ఒక ప్రపంచ స్థాయి వేదికగా మారింది.
  • ఈ ఏడాది ఆటిజం దినోత్సవాన్ని 'Autism and Humanity - Every Life Has Value' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఆటిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ప్రపంచాన్ని చూసే ఒక భిన్నమైన కోణమని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తుందనే అశాస్త్రీయ అపోహలను తొలగించి, వారిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించాలని ఈ ఏడాది పిలుపునిచ్చారు.
  • ఇది ఒక నరాల సంబంధిత అభివృద్ధి స్థితి (Neurodevelopmental condition). దీనివల్ల వ్యక్తులు ఇతరులతో సంభాషించడంలో, సామాజిక సంబంధాలు నెలకొల్పడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • స్థాయి 1: స్వల్ప ఇబ్బందులు ఉంటాయి, వీరు స్వతంత్రంగా జీవించగలరు.
  • స్థాయి 2: సంభాషణలో మరియు మార్పులకు అనుగుణంగా మారడంలో ఇబ్బందులు ఉంటాయి.
  • స్థాయి 3: వీరికి నిరంతర సంరక్షణ మరియు భారీ మద్దతు అవసరం ఉంటుంది.
  • ఆటిజం రావడానికి ఖచ్చితమైన కారణం ఇంకా పరిశోధనల్లోనే ఉంది. అయితే జన్యుపరమైన అంశాలు, మెదడు అభివృద్ధిలో తేడాలు, గర్భధారణ సమయంలో పర్యావరణ ప్రభావాలు వంటివి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
  • మద్దతు: ఆటిజంకు శాశ్వత నివారణ లేదు, కానీ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు బిహేవియర్ అనాలిసిస్ (ABA) ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.
  • దినోత్సవం: ఏప్రిల్ 2 (ప్రతి ఏటా).
  • 2026 థీమ్: Autism and Humanity - Every Life Has Value.
  • ప్రారంభం: 2007లో ఐక్యరాజ్యసమితి (UN) చేత.
  • గుర్తు: ఆటిజం అవగాహనకు నీలం (Blue) రంగును చిహ్నంగా ఉపయోగిస్తారు.
  • ఆటిజం మాసం: ఏప్రిల్ నెల మొత్తాన్ని 'ఆటిజం అవగాహన మాసం'గా జరుపుకుంటారు.
  • ముఖ్య గమనిక: ఆటిజం అనేది ఒక వ్యాధి (Disease) కాదు, అది ఒక స్థితి (Condition). దీనికి ప్రారంభ దశలోనే గుర్తింపు, సరైన థెరపీ అవసరం.
  • భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మార్చి 31, 2026న 'ఐఎన్ఎస్ మాల్వన్' యుద్ధనౌకను నావికాదళానికి అందజేశారు. ఇది తక్కువ లోతు గల నీటిలో (Shallow Water) శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టి, వేటాడగల అత్యాధునిక యుద్ధనౌక. 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించడం విశేషం.
  • నిర్మాణం: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ఈ నౌకను నిర్మించింది.
  • శ్రేణి: ఇది ఎనిమిది 'యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్' (ASW SWC) ప్రాజెక్టులో భాగంగా తయారైన రెండవ నౌక.
  • ప్రత్యామ్నాయం: ప్రస్తుతం సేవల్లో ఉన్న పాత 'అభయ్' క్లాస్ కార్వెట్ నౌకల స్థానంలో ఇవి చేరనున్నాయి.
  • సాధారణంగా పెద్ద యుద్ధనౌకలు తీరానికి సమీపంలో ఉండే తక్కువ లోతు గల నీటిలో (Littoral waters) సమర్థవంతంగా పనిచేయలేవు. కానీ శత్రువుల జలాంతర్గాములు ఇక్కడే మాటువేసి దాడులు చేసే అవకాశం ఉంటుంది.
  • సోనార్ వ్యవస్థ: ఇందులో అమర్చిన అత్యాధునిక సోనార్ మరియు సర్వైలెన్స్ వ్యవస్థలు నీటి అడుగున ఉన్న ముప్పులను ఇట్టే గుర్తిస్తాయి.
  • తొలి రక్షణ కవచం: భారత తీరప్రాంతం, ఓడరేవులు మరియు సముద్రపు సరిహద్దులను రక్షించడంలో ఇది మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది.
  • శత్రువుల జలాంతర్గాములను గుర్తించడం, వాటి కదలికలను కనిపెట్టడం మరియు అవసరమైతే వాటిని నాశనం చేసే ప్రక్రియనే 'యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్' అంటారు. ఐఎన్ఎస్ మాల్వన్ ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన యుద్ధనౌక.
  • నౌక పేరు: ఐఎన్ఎస్ మాల్వన్ (INS Malwan).
  • రకం: యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW SWC).
  • తయారీదారు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL).
  • స్వదేశీ వాటా: 80% పైగా భాగాలను భారత్‌లోనే తయారు చేశారు.
  • ముఖ్య ఉద్దేశ్యం: తీరప్రాంత జలాల్లో శత్రువుల జలాంతర్గాములను అరికట్టడం.
  • అప్పగించిన తేదీ: మార్చి 31, 2026.
  • దేశంలోని పౌరులకు న్యాయపరమైన సమాచారాన్ని సులభంగా అందించే లక్ష్యంతో 'డిషా' (DISHA) కార్యక్రమంలో భాగంగా 'న్యాయ సేతు' ఏఐ చాట్‌బోట్‌ను ఆవిష్కరించారు. దీనితో పాటు ఈ చాట్‌బోట్ అధికారిక మస్కట్ 'దిషిక' (Dishika)ను కూడా పరిచయం చేశారు. భాషా అడ్డంకులను తొలగించి, ప్రతి పౌరుడికి తన న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
  • రూపకల్పన: దీనిని డిజిటల్ ఇండియా 'భాషిణి' విభాగం (DIBD) రూపొందించింది.
  • బహుభాషా మద్దతు: ఇది 36 రాత భాషలలో, 23 వాయిస్ భాషలలో సేవలందిస్తుంది. ఇందులో క్లిష్టమైన గిరిజన మాండలికాలు కూడా ఉండటం విశేషం.
  • వాయిస్-ఫస్ట్ డిజైన్: చదవడం, రాయడం రాని వారు కూడా కేవలం మాటల ద్వారా (Voice) తమ సందేహాలను అడగవచ్చు. దీనికోసం 'భాషిణి ASR' (ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్) సాంకేతికతను వాడుతున్నారు.
  • ఈ చాట్‌బోట్ భారతీయ న్యాయ సంహిత (BNS) వంటి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లపై శిక్షణ పొందింది. వినియోగదారులు అడిగే ప్రశ్నలను విశ్లేషించి, సందర్భోచితంగా మరియు బాధ్యతాయుతంగా సమాధానాలను అందిస్తుంది. ఇది రియల్-టైమ్ ప్రాసెసింగ్ ద్వారా రోజుకు లక్షలాది మందికి తక్షణ మార్గదర్శకత్వం చేయగలదు.
  • న్యాయ సేతు చాట్‌బోట్‌కు 'దిషిక' ఒక స్నేహపూర్వక ముఖచిత్రంలా పనిచేస్తుంది.
  • లక్ష్యం: మొదటిసారి ఏఐని వాడుతున్న వారు లేదా న్యాయ వ్యవస్థ పట్ల భయం ఉన్నవారికి ఒక డిజిటల్ గైడ్‌లా సహాయం చేస్తుంది.
  • నమ్మకం: సంక్లిష్టమైన చట్టపరమైన అంశాలను సరళంగా వివరించడం ద్వారా పౌరులకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న దూరాన్ని ఇది తగ్గిస్తుంది.
  • పేరు: న్యాయ సేతు (Nyaya Setu) AI చాట్‌బోట్.
  • మస్కట్: దిషిక (Dishika).
  • అభివృద్ధి చేసిన సంస్థ: డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (DIBD).
  • సాంకేతికత: వాయిస్-ఫస్ట్, మల్టీ మోడల్ మరియు మల్టీ లింగ్యువల్ ఏఐ.
  • ముఖ్య ఉద్దేశ్యం: న్యాయాన్ని ప్రజాస్వామ్యీకరించడం (Democratize access to justice) మరియు భాషా అడ్డంకులను తొలగించడం.
  • భాషలు: 36 రాత భాషలు, 23 వాయిస్ భాషలు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education